కర్నాటక బందీపూర్ అభయారణ్యంలో కార్చిచ్చు
బెంగళూరు : కర్నాటక లోని బందీపూర్ అభయారణ్యంలో కార్చిచ్చు చెలరేగింది. గత రెండు రోజులుగా ఈ కార్చిచ్చు కర్నాటక వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నది. నిన్నటి నుంచి బందిపూర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే గాలులు బలంగా వీస్తుండటంతో వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. నిన్న రాత్రి వరకూ దాదాపు 200 ఎకరాల అడవి మంటల్లో బూడిదైపోయింది.
బెంగళూరు : కర్నాటక లోని బందీపూర్ అభయారణ్యంలో కార్చిచ్చు చెలరేగింది. గత రెండు రోజులుగా ఈ కార్చిచ్చు కర్నాటక వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నది. నిన్నటి నుంచి బందిపూర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే గాలులు బలంగా వీస్తుండటంతో వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. నిన్న రాత్రి వరకూ దాదాపు 200 ఎకరాల అడవి మంటల్లో బూడిదైపోయింది.