కృష్ణా జిల్లాలో యాక్సిడెంట్, తండ్రీకూతుళ్లను బలితీసుకున్న లారీ
కృష్ణా జిల్లాలో ఘోర యాక్సిడెంట్ జరిగింది. అదుపుతప్పి దూసుకొచ్చిన లారీ యమపాశంలా మారి తండ్రీకూతుళ్లను బలితీసుకుంది.
కృష్ణా జిల్లాలో ఘోర యాక్సిడెంట్ జరిగింది. అదుపుతప్పి దూసుకొచ్చిన లారీ యమపాశంలా మారి తండ్రీకూతుళ్లను బలితీసుకుంది. ఈ విషాద ఘటన కానుమోలు గ్రామం వద్ద చోటుచేసుకుంది. కానుమోలు గ్రామానికి చెందిన దాసరి లెనిన్, ఆయన కుమార్తె వంజరపు శ్రీదేవి బైక్పై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. లారీ బైక్ని ఢీకొని పక్కనే ఉన్న నీటి గుంటలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు స్పాట్ లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కోఆపరేటివ్ బ్యాంకులో జాబ్ చేస్తున్న లెనిన్ కూతురితో కలసి వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. తండ్రీకూతుళ్ల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read : బాలూ, నువ్వు లేకుండా ఎలా ..?