రైతుల నిరసన, యూపీ-ఢిల్లీ సరిహద్దుల పాక్షిక మూసివేత, ఢిల్లీ-మీరట్ హైవేపై అన్నదాతల రాస్తా రోకో.
రైతుల ఆందోళన ఆదివారం నాటికి 25 వ రోజుకు చేరుకుంది. వీరి ఆందోళన నేపథ్యంలో యూపీ-ఢిల్లీ సరిహద్దులను పాక్షికంగా మూసివేశారు. అటు ఢిల్లీ-మీరట్ హైవేపై అన్నదాతలు రాస్తా రోకో..
రైతుల ఆందోళన ఆదివారం నాటికి 25 వ రోజుకు చేరుకుంది. వీరి ఆందోళన నేపథ్యంలో యూపీ-ఢిల్లీ సరిహద్దులను పాక్షికంగా మూసివేశారు. అటు ఢిల్లీ-మీరట్ హైవేపై అన్నదాతలు రాస్తా రోకో నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్ఛే రైతులను అనుమతించకపోతే 24 గంటల్లోగా ఈ జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు. అటు పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ మళ్ళీ కేంద్రంపై విరుచుకపడ్డారు. అన్నదాతల ఆందోళన ఉధృతికి కేంద్రానిదే బాధ్యత అని, 20 మందికి పైగా అన్నదాతలు మరణించినా కేంద్రానికి ఏ మాత్రం పట్టలేదని ఆయన అన్నారు. కేంద్రం చేబట్టిన మొండి వైఖరి దానికే ముప్పు అని కూడా ఆయన వార్నింగ్ ఇఛ్చారు . కాగా తమ ఆందోళన వెనుక ఏ రాజకీయ పార్టీ కూడా లేదని రైతు సంఘాలు పేర్కొన్నాయి. విపక్షాలను విమర్శించడం మాని ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ సంఘాలు కోరాయి. మరోవైపు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ను కలిసి అన్నదాతల నిరసన నేపథ్యంలో వారితో మళ్లీ చర్చలు జరపాలని కోరారు.