Farmers protest: చర్చలకు రాం.. మరోసారి రైతు సంఘాలు చర్చలకు రావాలన్న కేంద్రం ఆహ్వానంపై మండిపాటు
ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మరోసారి రైతు సంఘాలతో చర్చలు...
ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రైతు సంఘాలను ఈనెల ఈనెల 30న మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు ఆహ్వానించింది. అయితే కేంద్రం తీరుపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతు సంఘాలు మొత్తం అజెండాను కేంద్రం ఒప్పుకోవడం లేదని, సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోందని రైతు సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం చాలా తెలివిగా మాటలతో మాయ చేయాలని చూస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ధ్వజమెత్తింది. చర్చల పేరుతో కేంద్రం రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని, న్యూఇయర్ వేడుకల సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రమాణం చేయాలని తెలిపింది. ఈ నెల 30న చర్చలకు రావాలన్న కేంద్రం ఆహ్వానంపై మండిపడుతున్నాయి.
కాగా, మూడు వ్యవసాయ చట్టాలను తొలగించే అంశం, కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ ఇవ్వడం, పంట వ్యర్థాలు తగులబెట్టిన విషయంలో నమోదుచేసిన కేసులను ఎత్తివేయడం, విద్యుత్ ముసాయాదా బిల్లు -2020లో మార్పులు తదితర అంశాలను ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మళ్లీ చర్చలకు వస్తామని రైతు సంఘాలు తెలిపాయి. మరి ఈ చర్చల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Farmers protest: రైతుల ఆందోళన.. రైతు సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం