యూపీ-ఘాజీపూర్ బోర్డర్లో మరో రైతు ఆత్మహత్య, అన్నదాతల కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ సూసైడ్ నోట్
యూపీ-ఘాజీపూర్ బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడిని ఉత్తరాఖండ్ కు చెందిన సర్దార్ కాశ్మీర్ సింగ్ లాడీగా గుర్తించారు..
Farmers Protest: యూపీ-ఘాజీపూర్ బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడిని ఉత్తరాఖండ్ కు చెందిన సర్దార్ కాశ్మీర్ సింగ్ లాడీగా గుర్తించారు. ఈ సరిహద్దుల్లోని టాయిలెట్ లో ఉరివేసుకుని ఈయన సూసైడ్ కి పాల్పడ్డాడు. అన్నదాతల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడంలేదని, ఇన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా చర్చల పేరిట కాల యాపన చేస్తోందని ఈ రైతు ఆరోపించాడు. తన అంత్యక్రియలను తన మనుమలే నిర్వహించాలని కాశ్మీర్ సింగ్ తన సూసైడ్ నోట్ లో కోరడం విశేషం. వీరు కూడా ఈ బోర్డర్ లో నెలరోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు.
యూపీలోని బాగ్ పట్ కు చెందిన 57 ఏళ్ళ గల్టన్ సింగ్ అనే ఓ రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఇతని మృతదేహాన్ని ..భారతీయ కిసాన్ యూనియన్ పతాకంతో చుట్టి ఈ రైతుసంఘం నేతలు, అన్నదాతలు నివాళి అర్పించారు. అయితే ఈ రైతు గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు చెప్పడం విశేషం.
LPG cylinder booking : గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇలా చేసుకోండి.. ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్
నూతన సంవత్సర వేడుకల్లో వేలాది పక్షుల బలి . రోమ్ లో ఫైర్ వర్క్స్ ‘హంగామా; ప్రజల ఉత్సాహం , మూగజీవాల మృతి