రాజ‌కీయ ల‌బ్ది కోసమే వ‌రంగ‌ల్ వ‌చ్చారు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డికి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కౌంట‌ర్ ఇచ్చారు. కిష‌న్‌రెడ్డి వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌పై ఆయ‌న ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్‌కు రావాల‌ని కిష‌న్‌రెడ్డిని కోరినా రాలేద‌ని..

రాజ‌కీయ ల‌బ్ది కోసమే వ‌రంగ‌ల్ వ‌చ్చారు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్
Follow us

|

Updated on: Dec 12, 2020 | 7:07 PM

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డికి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కౌంట‌ర్ ఇచ్చారు. కిష‌న్‌రెడ్డి వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌పై ఆయ‌న ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్‌కు రావాల‌ని కిష‌న్‌రెడ్డిని కోరినా రాలేద‌ని, ఇప్పుడు రాజ‌కీయ ల‌బ్ది కోసం కిష‌న్‌రెడ్డి వ‌రంగ‌ల్‌కు వ‌చ్చార‌ని ఆరోపించారు. కేఎంసీలో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి నిధులు విడుద‌ల చేయ‌డంలో మీరే జాప్యం చేశారంటూ విమ‌ర్శించారు. బీజేపీ అధికారంలోకి రాక‌ముందే కేఎంసీ సూప‌ర్ స్పెషాలిటీ వ‌చ్చింద‌ని, ఇప్పుడు రాజ‌కీయ ల‌బ్ది కోసం కేఎంసీ నిధుల‌పై మాట్లాడుతున్నార‌ని, ఉమ్మ‌డి జిల్లా ప‌రిధిలో జాతీయ ర‌హ‌దారులు దుర్భ‌రంగా మారినా ప‌ట్టించుకున్న నాథుడే లేడ‌ని మండిప‌డ్డారు.

అభివృద్ధిపై గ‌తంలో ఎందుకు స‌మీక్ష చేయ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జీడ‌బ్ల్యూఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రి కిష‌న్‌రెడ్డి వ‌రంగ‌ల్‌కు వ‌చ్చార‌ని, జిల్లాలో గిరిజ‌న యూనివ‌ర్సిటీ జాడ‌లేకుండా చేశార‌ని ఎర్ర‌బెల్లి ధ్వ‌జ‌మెత్తారు. టెక్స్‌టైల్స్ నిర్మాణానికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆరోపించారు.

జిల్లాకు రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ హామీని ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాజీపేట‌కు రావాల్సిన కోచ్ ఫ్యాక్ట‌రీని గుజ‌రాత్‌కు తీసుకెళ్లార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. రైల్వేను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డం దారుణ‌మ‌ని, బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ ఊసే లేద‌ని కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయ ప‌బ్బం కోస‌బ‌మే కిష‌న్‌రెడ్డి వ‌రంగ‌ల్‌కు వ‌చ్చార‌న్నారు.