ED Focus on Loan App Scams : లోన్ యాప్ మోసాలపై ఈడీ స్పెషల్ ఫోకస్.. కూపీ లాగుతున్న అధికారులు..
లోన్ యాప్ మోసాలపై ఈడీ దృష్టి పెట్టింది. తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో లోన్ యాప్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది...
ED Focus on Loan App Scams : లోన్ యాప్ మోసాలపై ఈడీ దృష్టి పెట్టింది. తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో లోన్ యాప్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దర్యాప్తు చేపడుతున్న రూ.1,100 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణం కేసులో భాగంగా లోన్ యాప్ మోసాల సంగతి కూడా తేల్చేందుకు రెడీ అవుతోంది.
ప్రజల్ని మోసగించడం, భారీగా డబ్బులు దండుకోవడం, ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో చైనా సహా ఇతర దేశాలకు తరలించడంలో ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్, లోన్ యాప్లకు సారూప్యత ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన ఫిర్యాదులపై ఈడీ దర్యాప్తు చేపట్టనుందని స్పష్టం చేశాయి.
బాకీ చెల్లించమంటూ పలు లోన్ యాప్లు చేస్తున్న వేధింపులు భరించలేక తెలంగాణలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డడారు. పోలీసులు ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేయగా, 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు చైనీయులు కూడా ఉండటం తెలిసిందే. .
అయితే తమిళనాడు పోలీసులు కూడా స్థానికుల ఫిర్యాదుల మేరకు పలువురని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. చైనాకు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు.