KGF 3: కేజీఎఫ్ 3 పై ప్రశాంత్ నీల్ క్లారిటీ..అన్ని అనుమానాలు పటాపంచలు చేసిన స్టార్ డైరెక్టర్
'బాహుబలి' తరువాత ఆ రేంజ్లో సక్సెస్ అయిన పాన్ ఇండియా మూవీ అంటే అందరూ టక్కున 'కేజీఎఫ్' అని చెప్పేస్తారు. త్వరలో ఈ మూవీ సీక్వెల్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
KGF 3: ‘బాహుబలి’ తరువాత ఆ రేంజ్లో సక్సెస్ అయిన పాన్ ఇండియా మూవీ అంటే అందరూ టక్కున ‘కేజీఎఫ్’ అని చెప్పేస్తారు. త్వరలో ఈ మూవీ సీక్వెల్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ టైంలో కేజీఎఫ్ మూవీ గురించి ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. సెకండ్ పార్ట్ ఓకే.. మరి థర్డ్ పార్ట్ సంగతేంటి..అన్నది పలువురి మనసులో మెదులుతోన్న ప్రశ్న. ప్రతీ ఇంటర్వ్యూలో, ప్రతీ ప్రెస్మీట్లో.. డైరెక్టర్ను ఈ ప్రశ్నే అడుగుతున్నారు. దీంతో ఫైనల్గా మూడవ భాగం గురించి క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ‘నేను రాసుకున్న కథ రెండు భాగాలకే.. సక్సెస్ అయ్యింది కదా అని మూడో పార్ట్ చేద్దామన్నా.. అంత సాలిడ్ స్టోరి కావాలి. ప్రజెంట్ నా దగ్గర స్టోరి లేదు.. సో కేజీఎఫ్ 3 ఉండదు’ అని క్లియర్ కట్గా చెప్పేశారు.
అంటే.. రాఖీ భాయ్ హీరోయిజం సెకండ్ పార్ట్తో ఎండ్ అయిపోతుందన్నమాట. ఇప్పటికే డార్లింగ్తో సలార్ సినిమాను ఎనౌన్స్ చేశారు ప్రశాంత్. ఆ తరువాత ఎన్టీఆర్తో మూవీ ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ను లైనప్ చేసిన ప్రశాంత్ నీల్.. మళ్లీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో అడుగు పెట్టే ఛాన్సే లేదంటున్నారు సాండల్వుడ్ జనాలు.
Also Read :