అలాగే జరిగితే ఇక ఓటీటీలోనే ‘నిశ్శబ్దం’ విడుదల
ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమైన సినిమాలకు నిర్మాణ భారం రోజురోజుకీ పెరిగిపోతుంది. కాగా ఇప్పటికే పలు చిన్న సినిమాలను ఓటీటీల్లో విడుదల చేశారు దర్శక, నిర్మాతలు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తుందనే..
ఎప్పటికప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారని.. ప్రజలంతా ఎదురు చూస్తుంటే.. అది కాస్తా పొడిగింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా మే 3వ తేదీతో ముగియాల్సిన లాక్డౌన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 17వ తేదీ వరకూ పొడిగించారు. దీంతో ఈ నెల కూడా లాక్డౌన్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ కాస్తా చిత్ర పరిశ్రమకు గట్టిగానే తగిలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీ కోలుకోవాలంటే చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమైన సినిమాలకు నిర్మాణ భారం రోజురోజుకీ పెరిగిపోతుంది. కాగా ఇప్పటికే పలు చిన్న సినిమాలను ఓటీటీల్లో విడుదల చేశారు దర్శక, నిర్మాతలు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై మాట్లాడారు డైరెక్టర్ హేమంత్ మధుకర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు ఓటీటీ ప్లాట్ఫ్లామ్ల నుంచి ఆఫర్లు వచ్చిన మాటల వాస్తవమే. కానీ మా చిత్ర బృందం మాత్రం థియేటర్లో విడుదలకే ఆసక్తి చూపిస్తోంది. కాగా ఇప్పటికే తెలుగు వర్షన్కి సంబంధించి అన్ని పనులూ పూర్తయ్యాయి. ఇక తమిళ, మలయాళ, హిందీ వెర్షన్ల పనులు మిగిలే ఉన్నాయి. అవన్నీ అయ్యాక విడుదల విషయంలో పునారాలోచిస్తాం. లాక్ డౌన్ ఎంత కాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆయా పరిస్థితుల్ని బట్టి ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయాలా? లేక ఓటీటీలోకి తీసుకురావాలా? అన్నది నిర్మాతలు ఆలోచిస్తారు.
కాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఇందులో అనుష్క మరో ఛాలెంజింగ్ రోల్లో నటించింది. అలాగే మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని కోన వెంకట్ నిర్మించారు.
Read More:
గుడ్న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం: డేంజర్ జోన్లుగా అమెరికా, రష్యా, బ్రిటన్..
బాలీవుడ్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!