లాక్ డౌన్ వేళ.. ఢిల్లీ పోలీసుల సేవలు.. మెచ్చుకోవాల్సిందే..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ 1893 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉంది. ఎక్కడ.. ఎవరికి.. కరోనా ఉందో తెలియదు.
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ 1893 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉంది. ఎక్కడ.. ఎవరికి.. కరోనా ఉందో తెలియదు. అయినప్పటికీ… ఢిల్లీ పోలీసులు… ప్రాణాలకు తెగించి… కంటిన్యూగా ప్రజా సేవలో నిమగ్నం అవుతున్నారు.
ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. అయితే.. ఎప్పుడో 1948లో ఢిల్లీ పోలీస్ శాఖ ఏర్పడగా… అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పుడూ చెయ్యనంత అతి పెద్ద భారీ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టారు పోలీసులు. మొత్తం 50 లక్షల ఆహార ప్యాకెట్లను ఢిల్లీలో అర్బన్ పేదలకు, ఇళ్లు లేని వారికీ పంచారు. అంతేకాదు… పేదలకు 145 టన్నుల (1,45,000 కేజీలు) రేషన్ సరుకులను పంపిణీ చేశారు.
Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..