టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నాంః ఢిల్లీ పేసర్ మోహిత్శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటి వరకు పెద్దగా పర్ఫార్మెన్స్ చేసింది.. ఇప్పటి వరకు జరిగిన 12 ఐపీఎల్ సీజన్లలో ప్లే ఆఫ్స్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది.. టైటిల్ సాధించడమన్నది ఢిల్లీ కేపటిల్స్ డ్రీమ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటి వరకు పెద్దగా పర్ఫార్మెన్స్ చేసింది.. ఇప్పటి వరకు జరిగిన 12 ఐపీఎల్ సీజన్లలో ప్లే ఆఫ్స్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది.. టైటిల్ సాధించడమన్నది ఢిల్లీ కేపటిల్స్ డ్రీమ్… 2008లో ప్రారంభయమైన మొదటి సీజన్లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది ఢిల్లీ జట్టు.. మళ్లీ 2012లో ఇంకోసారి ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యింది.. ఢిల్లీ డేర్ డేవిల్స్ పేరు అచ్చిరాలేదేమోననుకుని లాస్టియర్ ఢిల్లీ కేపిటల్స్గా కూడా మార్చుకుంది. ఆ పేరు మహత్యమో లేక శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ప్రతిభో తెలియదు కానీ ఆ జట్టు మరోసారి ప్లే ఆఫ్స్కు చేరింది..
జట్టులో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవేమీ లేదు.. శిఖర్ ధవన్, రిషబ్ పంత్, పృథ్వీ షా, సందీప్ లమిచ్చానే వంటి ఆటగాళ్లతో టీమ్ బలంగానే కనిపిస్తుంది.. ఇక ఈ సీజన్లో రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానేను జట్టులోకి వచ్చారు.. ఈసారి కప్ కొట్టి తీరతామంటున్నాడు ఆ జట్టు మీడియం పేస్ బౌలర్ మోహిత్ శర్మ.. తమ టీమ్ పటిష్టంగా ఉందన్నాడు. ఇంతకు ముందు వేరే జట్టకు ప్రాతినిధ్యం వహించినప్పుడు అపోనెంట్ టీమ్గా ఢిల్లీని దగ్గర నుంచి చూశానని, ఇప్పుడు ఢిల్లీ కేపిటల్స్ అంచనాలకు మించి రాణిస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చారు మోహిత్శర్మ.. యంగ్ ప్లేయర్లతో బలంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. తమ టీమ్ ప్రధాన కోచ్గా రికీ పాంటింగ్ రావడం, రేయాన్ హరీస్ బౌలింగ్ కోచ్ ఉండటంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు.. ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్గానే బరిలో దిగుతున్నామని వివరించాడు. సెప్టెంబర్ 20న ఢిల్లీ కేపిటల్స్ తన మొదటి మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను ఎదుర్కొనబోతున్నది..