కొంకుర్స్ క్షిపణి పరీక్షకు బీడీఎల్ సామాగ్రి
హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తయారు చేసిన స్వదేశీ పరిజ్జానంతో తయారై క్షిపణి సామాగ్రిలను జాతికి అందించారు కేంద్ర రక్షణమంత్రి.
దేశ రక్షణ లో స్వదేశీ పరిజ్జానంతో తయారై క్షిపణి సామాగ్రిలను జాతికి అందించారు కేంద్ర రక్షణమంత్రి. హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తయారు చేసిన కొంకుర్స్ క్షిపణి పరీక్ష సామగ్రి, లాంచర్ టెస్ట్కు సంబంధించిన ఉత్పత్తులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం విడుదల చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బీడీఎల్ వీటిని అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి పరీక్ష సామగ్రిని.. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులైన‘కొంకుర్స్’ సన్నద్ధతను తెలుసుకోవడం కోసం వినియోగించనున్నారు.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పరికరాలు భారత ప్రభుత్వానికి ఎంతో లాభదాయకంగా ఉంటాయని బీడీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఈ పరికరాలను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా మన దేశంలో తయారు చేసిన సామాగ్రిని దేశ రక్షణలో ఉపయోగించనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బీడీఎల్ వీటిని అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి పరీక్ష సామగ్రిని.. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులైన‘కొంకుర్స్’ సన్నద్ధతను తెలుసుకోవడం కోసం వాడతారు.