ఉపాధ్యాయుల బదిలీలు.. పాఠశాలల ఎంపికకు ఇవాళ్టితో చివరి రోజు.. ఎంపిక ప్రక్రియకు కొంత ఆలస్యమయ్యే ఛాన్స్
ఉపాధ్యాయుల బదిలీల్లో పాఠశాలల ఎంపికకు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు 3,448మంది వెబ్ ఐచ్ఛికాలను...
AP Teacher Transfers : ఉపాధ్యాయుల బదిలీల్లో పాఠశాలల ఎంపికకు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు 3,448మంది వెబ్ ఐచ్ఛికాలను ఫ్రీజ్ చేయకుండా వదిలేసినట్లు అధికారులు గుర్తించారు.
మరో 1,763 మందికి చెందిన ఐచ్ఛికాల మార్పు వివరాలు మండల విద్యాధికారుల వద్దే నిలిచిపోయాయి. అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నందున ఉపాధ్యాయులకు స్థానాల కేటాయింపు కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే చాలా కాలంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు బదిలీల కోసం డిమాండ్ చేస్తున్నాయి. 2017లో చివరి సారి బదిలీలు జరిగాయి. ఆ తర్వాత ట్రాన్సఫర్లు వివిధ కారణాలతో నిలిచి పోయాయి. పాఠశాలలు మధ్యలో బదిలీలు సాధ్యం కాదు అని అధికారులు తెలపడంతో ఉపాధ్యాయులు కూడా విరమించుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా ఇలా అవకాశం వచ్చింది.
Also Read:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!
వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్కు కాల్ చేయండి.!