హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని గురువారం అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు స‌భ్యుల్లో ఇద్ద‌రి నుంచి రూ. 40 వేల‌తో పాటు రెండు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం

హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
Follow us

|

Updated on: Sep 24, 2020 | 7:05 PM

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని గురువారం అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు స‌భ్యుల్లో ఇద్ద‌రి నుంచి రూ. 40 వేల‌తో పాటు రెండు సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను పాత‌బ‌స్తీలోకి త‌లాబ్‌క‌ట్ట‌కు చెందిన స‌య్య‌ద్ స‌త్తార్ , మ‌హ్మ‌ద్ హ‌స‌న్, సయ్య‌ద్ ఖ‌లీం అలీగా పోలీసులు గుర్తించారు.

సయ్య‌ద్ ఖ‌లీం పరారీలో ఉన్నాడు. నిన్న జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, ముంబై టీమ్‌పై వీరు బెట్టింగ్ పెట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు. సుల‌భంగా డ‌బ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని నిందితులు ఎంచుకున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలా బెట్టింగ్ బుకీలు బయటికొస్తారు. స్మార్ట్ ఫోన్‌తో స్మార్ట్‌గా దోపిడీ చేస్తారు.  ఇలాంటి బుకీలు హైదరాబాద్‌లో రంగంలోకి దిగుతారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఆన్ లైన్ దందాకు తెరలేపుతారు. ఇలాంటి మఫియాలు తెలుగు రాష్ట్రాల్లోని ఐపీఎల్ ప్రియులను వల వేసి పట్టుకుంటున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఆన్ లైన్ లో భారీగా వ్యాపారం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసు కన్నుగప్పి తప్పించుకోలేరు.