ఇది బీజేపీ రాజకీయ కక్ష,, సీతారాం ఏచూరి ఫైర్
ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అక్రమ చర్యలు ఆ పార్టీ రాజకీయ ప్రభావితమైనవేనని, శాంతియుతంగా..
ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అక్రమ చర్యలు ఆ పార్టీ రాజకీయ ప్రభావితమైనవేనని, శాంతియుతంగా నిరసనలకు దిగుతున్నవారంటే ఈ సర్కార్ భయపడుతున్నట్టు కనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా గతంలో ప్రదర్శన చేసినందుకు తనతో సహా స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, ఎకనామిస్ట్ జయతి ఘోష్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వారు తమ అనుబంధ చార్జిషీట్ లో తమను సహ కుట్రదారులుగా పేర్కొన్నారని ఆయన అన్నారు. ఢిల్లీ అల్లర్లలో 56 మందికి పైగా మరణించారని, ఇక రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేసినవారిని పోలీసులు వదిలేశారని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి కేసులకు బెదరబోమన్నారు.
Delhi Police is under the Centre and Home Ministry. Its illegitimate, illegal actions are a direct outcome of the politics of BJP’s top leadership. They are scared of legitimate peaceful protests by mainstream political parties & are misusing state power to target the Opposition https://t.co/8uGr4x1ylC
— Sitaram Yechury (@SitaramYechury) September 12, 2020