COVID-19 Vaccination : ఎల్లుండి కరోనా టీకా పంపిణీకి ఏపీలో సర్వం సిద్ధం, గన్నవరం నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ తరలింపు
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా టీకాలు వేయడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అన్ని..
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా టీకాలు వేయడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు మధ్య కృష్ణాజిల్లా గన్నవరం వ్యాధినిరోధక టీకాల కేంద్రం నుంచి అన్ని జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ తరలించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న 3లక్షల 70వేల మంది వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. కేసుల తీవ్రత, ఫ్రంట్లైన్ ఉద్యోగుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు వేల సంఖ్యలో డోసులు పంపారు. కృష్ణాజిల్లాకు 42వేల 500 డోసులు, గుంటూరుజిల్లాకు 43వేల500 డోసులు తరలించారు. దాంతోపాటు ప్రకాశంజిల్లా 31 వేలు, నెల్లూరుకు 38వేల 500 డోసులు, వెస్ట్గోదావరి 33వేల500, ఈస్ట్గోదావరిజిల్లాకు 47వేల డోసులు పంపించారు. ఇక శ్రీకాకుళంజిల్లాకు 26వేల500, విశాఖకు 46,వేల 500, విజయనగరం 21,500, అనంతపురంజిల్లాకు 35వేల500, కడపజిల్లాకు 28వేల 500, కర్నూలుకు 40వేల500 వ్యాక్సిన్ డోసులు తరలించారు.