బైసీపీ విద్యార్థులూ బీ అలర్ట్.. ఈనెల 16 నుంచే ప్రత్యేక విడత ఎంసెట్ కౌన్సెలింగ్.. 21 సీట్ల కేటాయింపు..
తెలంగాణ ఎంసెట్లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
తెలంగాణ ఎంసెట్లో అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ కౌన్సిలింగ్కు సంబంధించి ఇప్పటికే నోటీఫికేషన్ను విడుదల చేశామని ఆయన తెలిపారు. ఈనె 16న ఆన్లైన్ రిజిస్ర్టేషన్, 17న స్లాట్ బుకింగ్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అలాగే, 16 తేదీ నుండి 18వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇక 21వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.