తన గన్ మ్యాన్ పెళ్లి సందర్భంగా ఎంపీ సంతోష్ ఎలా విషెస్ తెలిపారో చూడండి..
తమ వద్ద పనిచేసే సిబ్బంది వివాహ వేడుకలకు, ఇతరత్రా ఫంక్షన్లకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులో ఈ కల్చర్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనా కారణంగా పెళ్లిళ్లకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదివరకే ముహూర్తాలు పెట్టకున్నవాళ్లు 200 మంది అతిథుల మధ్యే పెళ్లిళ్లు చేసుకోవాలని తెలిపింది. ఈ తరహా వివాహాలకు కూడా మార్చి 31వరకే అనుమతి […]
తమ వద్ద పనిచేసే సిబ్బంది వివాహ వేడుకలకు, ఇతరత్రా ఫంక్షన్లకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరవడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులో ఈ కల్చర్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనా కారణంగా పెళ్లిళ్లకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదివరకే ముహూర్తాలు పెట్టకున్నవాళ్లు 200 మంది అతిథుల మధ్యే పెళ్లిళ్లు చేసుకోవాలని తెలిపింది. ఈ తరహా వివాహాలకు కూడా మార్చి 31వరకే అనుమతి ఉంది.
దీంతో ఆల్రెడీ ముందుగానే ముహూర్తం ఫిక్స్ చేసుకున్న టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గన్ మ్యాన్ నరేందర్ గౌడ్ కూడా అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జీవిత భాగస్వామితో ఏడడుగులు వేశారు. ఎంపీ సంతోష్ కుమార్..ఆ జంటకు వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా..భువనగిరి సిటీలోని వైఎస్ఆర్ గార్డెన్లో నరేందర్ గౌడ్- ఉమారాణి పెళ్లి శుక్రవారం జరిగింది. తన గన్మెన్ లైఫ్లో కీలక ఘట్టం కావడంతో ఎంపీ సంతోష్ వ్యక్తిగతంగా అతడి వివాహానికి హాజరై ఆశీస్సులు అందించాలని భావించారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో..నరేందర్ దంపుతులకు వీడియో కాల్ చేసి విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని ఎంపీ ట్వీట్ చేయగా…”బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి..సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
My Gunman Narender Goud got married and couldn’t attend, but wished the newly wedded couple via video calling.
We have to follow certain things set by the government to #FightAgainstCoronaVirus no matter or what.
Let’s win da battle against #COVID2019 pic.twitter.com/7uK5HcvxIQ
— Santosh Kumar J (@MPsantoshtrs) March 20, 2020