నాంపల్లి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలందరికీ అధికారులు రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.

నాంపల్లి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Sep 14, 2020 | 2:19 PM

కరోనా సమాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరిని పట్టిపీడిస్తోంది. అయితే త్వరగా కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అధికంగా నే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ కరోనా వైరస్ భయం వెంటాడుతోంది.

తాజాగా నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలందరికీ అధికారులు రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే జాఫర్‌కు పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీలో సిబ్బంది, మీడియా, పోలీసులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదిలావుంటే అసెంబ్లీవిధుల్లో ఉన్న 13 మంది పోలీసులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీలో సిబ్బంది, మీడియా, పోలీసులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి హరీశ్‌కు కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. హోంమంత్రి మహమూద్ అలీకి కూడా కరోనా సోకింది.. చికిత్స తీసుకుని కోలుకున్నారు.