ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే.!
ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 66,769 శాంపిల్స్ను పరీక్షించగా 5,120 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427కి చేరింది.
Coronavirus Positive Cases: ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 66,769 శాంపిల్స్ను పరీక్షించగా 5,120 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427కి చేరింది. ఇందులో 49,513 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,78,828 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 34 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,086కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 62.83 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 424, చిత్తూరు 807, తూర్పుగోదావరి 807, గుంటూరు 433, కడప 301, కృష్ణా 464, కర్నూలు 144, నెల్లూరు 367, ప్రకాశం 264, శ్రీకాకుళం 172, విశాఖపట్నం 190, విజయనగరం 172, పశ్చిమ గోదావరి 575 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,246కి చేరుకుంది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 687 మంది కరోనాతో మరణించారు.
#COVIDUpdates: 07/10/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,31,532 పాజిటివ్ కేసు లకు గాను *6,75,933 మంది డిశ్చార్జ్ కాగా *6,086 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 49,513#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/98tbxMe0aK
— ArogyaAndhra (@ArogyaAndhra) October 7, 2020