రాహుల్కు సిబల్, ఆజాద్ ఘాటు కౌంటర్లు
కాంగ్రెస్లో అంతర్గత పోరు తీవ్రమైంది. సీనియర్లకు, రాహుల్ గాంధీకి అసలు పొసగడం లేదని ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.
కాంగ్రెస్లో అంతర్గత పోరు తీవ్రమైంది. సీనియర్లకు, రాహుల్ గాంధీకి అసలు పొసగడం లేదని ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. పార్టీలో సమర్ధవంతమైన శాశ్వత నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు సోనియాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంపైనే అగ్గి రాజుకుంది. బీజేపీతో కుమ్మక్కయి సోనియాకు సీనియర్లు లేఖ రాశారని రాహుల్ కామెంట్ చేయడంతో పరిస్థితుల తీవ్రత మరింత పెరిగింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్విట్టర్లో స్పందించారు. గడిచిన 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా తాము ఏ విషయంలోనూ వ్యవహరించలేదని గుర్తు చేశారు. రాజస్థాన్లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ పక్షాన నిలిచామని, మణిపూర్లో బీజేపీని గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించడం పట్ల కపిల్ సిబాల్ అసహనం వ్యక్తం చేశారు.
Rahul Gandhi says “ we are colluding with BJP “
Succeeded in Rajasthan High Court defending the Congress Party
Defending party in Manipur to bring down BJP Govt.
Last 30 years have never made a statement in favour of BJP on any issue
Yet “ we are colluding with the BJP “!
— Kapil Sibal (@KapilSibal) August 24, 2020
ఇదే విషయంపై మరో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సైతం ఘాటుగా స్పందించారు. బీజేపీతో కలిసి సోనియాకు లేఖ రాసామని నిరూపిస్తే తాను పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కాగా సీనియర్ల లేఖపై సీడబ్ల్యూసీ భేటీలో కూడా చర్చ జరుగుతోంది. పార్టీ అంతర్గత అంశమైన లేఖ బయటకు లీక్ అవడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పైగా సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో లేఖ రాయడంపై కూడా అసహనం వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.
Also Read :
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన సర్కార్