‘లేఖ’ రేపిన దుమారం, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ లుకలుకలు !
కాంగ్రెస్ ' అసమ్మతివాదులు' పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన 'లేఖ' సృష్టించిన దుమారం ఇంకా తగ్గలేదు. 'పూర్తి స్థాయి, సమిష్టి నాయకత్వం' అంటూ వారు రాసిన లేఖపై సంతకాలు చేసిన..
కాంగ్రెస్ ‘ అసమ్మతివాదులు’ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన ‘లేఖ’ సృష్టించిన దుమారం ఇంకా తగ్గలేదు. ‘పూర్తి స్థాయి, సమిష్టి నాయకత్వం’ అంటూ వారు రాసిన లేఖపై సంతకాలు చేసిన 23 మంది నేతల్లో ఒకరైన…. యూపీకి చెందిన ఎంపీ జితిన్ ప్రసాదను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ లఖిమ్ పూర్ ఖేరి పార్టీ శాఖ ఓ తీర్మానాన్ని ఆమోదించి ఓ లేఖను సోనియాకు పంపింది. అయితే ప్రసాద ను కపిల్ సిబల్ , మనీష్ తివారీ ఇద్దరూ సమర్థించారు. దురదృష్టవశాత్తూ యూపీలో జితిన్ ప్రసాద ను టార్గెట్ చేశారని, దీని బదులు బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేదని సిబల్ ట్వీట్ చేశారు. మనీష్ తివారీ కూడా ఆయనతో ఏకీభవించారు.
ఇక తాజాగా గులాం నబీ ఆజాద్ కూడా తమ లేఖను పరోక్షంగా సమర్థించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కొత్త సభ్యులను ఎన్నుకోవాలనే తమ లేఖలోని అంశాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు.