TELANGANA CONGRESS: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. ముందు వరుసలో నేనే ఉంటానంటూ..
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మరోసారి స్పందించారు. ఆదివారం నాడు వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీసీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
TELANGANA CONGRESS: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మరోసారి స్పందించారు. ఆదివారం నాడు వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీసీ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలనేనని స్పష్టం చేశారు. కేవలం వారి వారి ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేశారు. తనను ఎవరూ సంప్రదించలేదని, తానూ ఎవరిని సంప్రదించలేదని జానారెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో పీసీసీ పదవిపైనా ఆయన స్పందించారు. పీసీసీ పదవికి అర్హులలో తాను ముందు వరుసలో ఉన్నానని అన్నారు. అయితే అధిష్టానం ఆ పదవికి ఎవరికి ఇచ్చినా సహకరిస్తానని జానారెడ్డి ప్రకటించారు. అలాగే నాగార్జునసాగర్లో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని జానారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
Also Read:
రెచ్చిపోయిన ఆకతాయి.. పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడు.. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా చేశాడు..!