వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు : ఉత్తర్వులు జారీ
వైఎస్సార్ చేయూత అమలుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
వైఎస్సార్ చేయూత అమలుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా, మున్సిపాలిటీ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చైర్మన్గా మరో 13 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఏడుగురు మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు భాగస్వాములు చేసింది ప్రభుత్వం. ఇక కలెక్టర్ చైర్ పర్సన్గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఛైర్ పర్సన్గా మరో ఇద్దరు సభులతో మున్సిపాలిటీ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ అధ్యక్షతన మరో నలుగురు సభ్యులతో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు
ప్రతి కమిటీలో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న కంపెనీ ప్రతినిధులకు చోటు కల్పించింది. వారానికి ఒక సారి సమావేశం అవ్వాలని కమిటీలను సర్కార్ ఆదేశించింది. ఇక రాష్ట్ర స్థాయి కమిటీ 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని సూచించింది.సెప్టెంబర్ 21 లోగా లబ్దిదారులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించింది జగన్ ప్రభుత్వం.
Also Read :