రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కల్నల్, మేజర్ సహా ఐదుగురు మృతి
జమ్ముకశ్మీర్లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్లో హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. వీరమరణం పొందినవారిలో కల్నల్, మేజర్ కూడా ఉన్నారు. ఛాంజ్ముల్లాలో ముష్కరులు.. పౌరుల్ని బందీలుగా ఉంచారాన్న ఇన్పర్మేషన్ తో రక్షించేందుకు వెళ్లింది సైనిక బృందం. ఈ విషయాన్ని పసిగట్టి తెగబడిన ఉగ్రమూక..భద్రతా బలగాలపై కాల్పులు జరిపింది. వెంటనే అలర్టయిన భారత సైన్యం.. ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో భారత ఆర్మీ […]
జమ్ముకశ్మీర్లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్లో హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. వీరమరణం పొందినవారిలో కల్నల్, మేజర్ కూడా ఉన్నారు.
ఛాంజ్ముల్లాలో ముష్కరులు.. పౌరుల్ని బందీలుగా ఉంచారాన్న ఇన్పర్మేషన్ తో రక్షించేందుకు వెళ్లింది సైనిక బృందం. ఈ విషయాన్ని పసిగట్టి తెగబడిన ఉగ్రమూక..భద్రతా బలగాలపై కాల్పులు జరిపింది. వెంటనే అలర్టయిన భారత సైన్యం.. ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో భారత ఆర్మీ కల్నల్, మేజర్ సహా మొత్తం ఐదుగురు అమరులయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.