బీజేపీ నేత చెంప చెల్లుమనిపించిన కలెక్టర్‌..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసకుంది. జిల్లా కలెక్టర్‌ నివేధిత బీజేపీ నాయకుడి చెంప చెల్లుమనిపించారు. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ బయోరాలో సెక్షన్ 144 అమల్లో ఉండగా, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలు కలెక్టర్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో భారత్ మాతా కి జై నినాదాలు చేస్తోన్న ఓ బీజేపీ కార్యకర్తను  కలెక్టర్ చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే ఉన్న మరికొందరు కార్యకర్తలు కూడా […]

బీజేపీ నేత చెంప చెల్లుమనిపించిన కలెక్టర్‌..
Follow us

|

Updated on: Jan 19, 2020 | 9:57 PM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసకుంది. జిల్లా కలెక్టర్‌ నివేధిత బీజేపీ నాయకుడి చెంప చెల్లుమనిపించారు. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ బయోరాలో సెక్షన్ 144 అమల్లో ఉండగా, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలు కలెక్టర్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో భారత్ మాతా కి జై నినాదాలు చేస్తోన్న ఓ బీజేపీ కార్యకర్తను  కలెక్టర్ చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే ఉన్న మరికొందరు కార్యకర్తలు కూడా స్లో గన్స్ ఇవ్వడం ప్రారంభించారు. దీంతో సహనం కొల్పోయిన కలెక్టర్ గుంపులోకి వెళ్లి కార్యకర్తలను వన్ బై వన్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఎస్డీఎమ్ ప్రియ వర్మ సైతం కార్యకర్తలపై చేయిచేసుకున్నారు.

ఈ ఘర్షణలో.. బీజేపీ జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్ రవి బనోర్‌ సైతం కలెక్టర్ చేతిలో చెంప తిన్నారు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. లాఠీ ఛార్జ్‌‌లో జీరపూర్‌కు చెందిన గిర్రాజ్ జులానియా, పచోర్‌కు చెందిన బిజెపి ప్రధాన కార్యదర్శి వికాస్ క్రొయేషియా, మర్చంట్ సెల్ జిల్లా కన్వీనర్ దీపక్మల్ శర్మ తలకు గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సమాచారం అందుకున్న భోపాల్ డిఐజి డాక్టర్ ఆశిష్ నగర పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొత్తం సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. హింసకు యత్నించిన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.