పవన్ అభిమాని ప్రాణానికి సీఎం జగన్ అభయం
సీఎం జగన్ తన మంచి మనసు చాటుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న పవన్ కళ్యాణ్ అభిమాని గురించి తెలియడంతో వెంటనే స్పందించారు.
సీఎం జగన్ తన మంచి మనసు చాటుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న పవన్ కళ్యాణ్ అభిమాని గురించి తెలియడంతో వెంటనే స్పందించారు. అతడి వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..పవన్ ఫ్యాన్ నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించకపోతే ప్రమాదం అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. ఇదే విషయాన్ని పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నాగేంద్ర బాధను, అతడి తల్లి ఆవేదనను చూసి చలించిపోయిన జగన్ వెంటనే సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి చికిత్స కోసం రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ హాస్పిటల్కి ఎల్వోసీ అందజేశారు. గవర్నమెంట్ సహకారంతో పవన్ ఫ్యాన్ నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎప్పుటికప్పడు ఆస్పత్రి నుంచి వివరాలు సేకరిస్తున్నామని సీఎంఓ అధికారులు తెలిపారు.
This case came to CM @ysjagan sir notice. On his instructions we immediately spoke to hospital authorities and they agreed to treat at 10Lakhs. CM sir immediately sanctioned 10L & Stem cell therapy treatment started already and he is responding well. We are also in constant touch https://t.co/UGhdvjCgMf pic.twitter.com/jIEnLsUsx2
— Dr Hari Krishna (@HariKrishnaCMO) August 15, 2020
Also Read:
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు