శాంతించని వెలగపూడి..కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఆందోళన విరమించేంది లేదంటున్న కాలనీవాసులు
వెలగపూడి గ్రామంలోని ఎస్సీకాలనీలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభించే విషయంలో ఇరువర్గాల ఘర్షణ ఏర్పడింది. రెండురోజులుగా ఈ గొడవలు జరుగుతున్నాయ్. రెండు వర్గాలుగా విడిపోయి పరస్సరం రాళ్లు, ఇటుకలతో దాడి..
Tension In Velagapudi : గుంటూరు జిల్లా వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. క్రిస్మస్ స్టార్ పెట్టే విషయంలో రెండు రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న పోలీసులు వెలగపూడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
అయితే..రాత్రి నుంచి ఎస్సీ కాలనీలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసినా…స్థానికులు ఆందోళన కొనసాగించారు. రాళ్లదాడిలో గాయపడిన మొండెం బుజ్జి అనే మహిళ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళ మృతికి పోలీసులే కారణమంటూ ఓ వర్గం వారంతా ఆందోళన చేపట్టారు. వారిని నిలువరించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. తమకు న్యాయం చేసేవరకూ ఆందోళన విరమించేంది లేదంటూ భీష్మించారు కాలనీవాసులు.
వెలగపూడి గ్రామంలోని ఎస్సీకాలనీలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభించే విషయంలో ఇరువర్గాల ఘర్షణ ఏర్పడింది. రెండురోజులుగా ఈ గొడవలు జరుగుతున్నాయ్. రెండు వర్గాలుగా విడిపోయి పరస్సరం రాళ్లు, ఇటుకలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సుమారు 30 మందికిపైగా గాయాలయ్యాయ్. వారిలో పలువురు మహిళలు ఉన్నారు.ఈ విషయం తెలిసిన పోలీసులు వెలగపూడి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. మాట వినకపోవడంతో వారిపై లాఠీ ఝులిపించారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో…స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.