ఏపీలో రేపట్నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవు..!
ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రేపట్నుంచి ఏపీలో సినిమా థియేటర్లు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో థియేటర్ను తిరిగి ప్రారంభించేందుకు...
Theatres Open From October 15: అన్లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లను 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చునని.. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక దీనిపై చర్చించేందుకు తాజాగా ఏపీవ్యాప్తంగా ఉన్న సినిమా ఎగ్జిబిటర్లు విజయవాడలో సమావేశమయ్యారు.
ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రేపట్నుంచి ఏపీలో సినిమా థియేటర్లు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో థియేటర్ను తిరిగి ప్రారంభించేందుకు రూ. 10 లక్షలు అదనపు ఖర్చు అవుతుందని.. అంతేకాకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నిర్వహించడం కష్టమని ఎగ్జిబిటర్లు భావించారు. దీనితో రేపట్నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయానికి వచ్చారు. అలాగే ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలను ఎత్తివేయాలని ఎగ్జిబిటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also Read: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు!