డోంట్ వర్రీ.. వెంకన్న భక్తులకు ఎస్పీ అభయం

తిరుపతి, తిరుమలకు ఎలాంటి ఉగ్ర హెచ్చరికలు లేవని.. భక్తులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ప్రస్తుతం తిరుపతిలో సాధారణ తనిఖీలు మాత్రమే చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేవించారన్న వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తిరుపతి పటిష్టమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేతం. తిరుపతిలో ఉన్న చాలా ప్రదేశాల్లో కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. పనిచేయని కొన్ని ప్రాంతాల్లో మాత్రమ కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు లేఖ రాశాం’’ […]

డోంట్ వర్రీ..  వెంకన్న భక్తులకు ఎస్పీ అభయం
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 1:10 PM

తిరుపతి, తిరుమలకు ఎలాంటి ఉగ్ర హెచ్చరికలు లేవని.. భక్తులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ప్రస్తుతం తిరుపతిలో సాధారణ తనిఖీలు మాత్రమే చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేవించారన్న వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తిరుపతి పటిష్టమైన భద్రత కలిగిన ఆధ్యాత్మిక క్షేతం. తిరుపతిలో ఉన్న చాలా ప్రదేశాల్లో కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. పనిచేయని కొన్ని ప్రాంతాల్లో మాత్రమ కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు లేఖ రాశాం’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది శ్రీలంకలో ఉగ్రదాడి తరువాత చాలామంది ఉగ్రవాదులు భారత్‌కు చేరుకున్నారని.. ఇక్కడి పలు ప్రదేశాల్లో ఉగ్రదాడులు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.