ఆదిలాబాద్ వెళ్లిన కిషన్రెడ్డి… రిమ్స్ ఆస్పత్రి పరిశీలన, ‘ప్రధాని మోదీ గిఫ్ట్ ఇస్తే…’ అంటూ వ్యాఖ్యలు
ఆదిలాబాద్ ప్రజలకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇస్తే... రాష్ట్రం దాన్ని తిరస్కరిస్తోందా అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. 2016 లోనే సూపర్..
ఆదిలాబాద్ ప్రజలకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇస్తే… రాష్ట్రం దాన్ని తిరస్కరిస్తోందా అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. 2016 లోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కేటాయించినా… ఇంత వరకు రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పేదల ఆరోగ్యమంటేనే TRS సర్కార్కు ప్రాధాన్యత లేదన్నారు. మంగళవారం ఆదిలాబాద్ వెళ్లిన కిషన్రెడ్డి… రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, సిబ్బంది నియమాకంపై సమీక్ష చేశారు.