పెన్నా సిమెంట్స్ కేసు: ధర్మాన, సబితలకు సీబీఐ సమన్లు
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ మరో షాక్ ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ కేసులో ఆయనకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు తెలంగాన మంత్రి సబితకు నోటీసులు అందాయి. అలాగే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడి రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మలకు సైతం నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసిన కోర్టు.. ఆ […]
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ మరో షాక్ ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ కేసులో ఆయనకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు తెలంగాన మంత్రి సబితకు నోటీసులు అందాయి. అలాగే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడి రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మలకు సైతం నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసిన కోర్టు.. ఆ రోజు వీరంతా కోర్టుకు హాజరుకావాలని తెలిపింది.