ఆమ్రపాలి కేసులో ధోనీపై చర్యలు…?
ఆమ్రపాలి గ్రూపునకు గతంలో ప్రచారకర్తగా వ్యవహరించిన లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీపైనా చర్యలు చేపట్టాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) డిమాండ్ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్కు లేఖ రాసింది. ధోని ప్రచారానికి ప్రభావితమై చాలా మంది ఆమ్రపాలి ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేశారన్నది సీఏఐటీ వాదన. ఈ గ్రూపు తప్పు చేసినట్లు కోర్టులో రుజువైనందున, ఈ గ్రూపు తరఫున ప్రచారం చేసిన ధోనీని సైతం జవాబుదారీ చేయాలని […]
ఆమ్రపాలి గ్రూపునకు గతంలో ప్రచారకర్తగా వ్యవహరించిన లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీపైనా చర్యలు చేపట్టాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) డిమాండ్ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్కు లేఖ రాసింది. ధోని ప్రచారానికి ప్రభావితమై చాలా మంది ఆమ్రపాలి ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేశారన్నది సీఏఐటీ వాదన. ఈ గ్రూపు తప్పు చేసినట్లు కోర్టులో రుజువైనందున, ఈ గ్రూపు తరఫున ప్రచారం చేసిన ధోనీని సైతం జవాబుదారీ చేయాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. వేలాది మంది గృహ కొనుగోలుదారులను పుట్టి ముంచిన ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘రెరా’ రిజిస్ట్రేషన్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది.