ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో బాధితులకు కొనసాగుతున్న చికిత్స.. ఇద్దరి శరీరాల్లో నుంచి తూటాలు తొలగింపు..
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులకు హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స జరుగుతున్న
ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులకు హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మొతేషీన్ నడుము భాగంలో ఉన్న ఒక తూటా, సయ్యద్ జమీర్ శరీరంలో రెండు తూటాలను వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం న్యూరోసర్జన్ విభాగం, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల నుంచి వారు వైద్య సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఏఐఏంఐఎం ఆదిలాబాద్ శాఖను రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఘటన దురదృష్టకరమని, త్వరలోనే నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.