భద్రతా బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం
రాజస్థాన్లోని బోర్డర్ జిల్లా బాడ్మేర్ వద్ద దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తిని బార్డర్ సెక్యూరటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) మట్టుబెట్టాయి.
రాజస్థాన్లోని బోర్డర్ జిల్లా బాడ్మేర్ వద్ద దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తిని బార్డర్ సెక్యూరటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి గుజరాత్-రాజస్థాన్ అంతర్జాతీయ బోర్డర్లో కంచెను దాటి.. భారత భూభాగంలోకి రహస్యంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు దుండగుడు. ఇది గమనించిన భారత కాల్పులు జరిపాయి.
‘పగటిపూట పాక్ ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పడు బీఎస్ఎఫ్ విఫలమైంది. అయితే, ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో చొరబాటుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం దృష్ట్యా బీఎస్ఎఫ్ అలెర్టయ్యిందని.’ అని సైన్యాధికారులు వెల్లడించారు.