కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డీఆర్డీవో నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను డీఆర్డీవో పరీక్షించింది. ఆర్మీ సహకారంతో క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా డీఆర్డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణితో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని యుద్ధ ట్యాంకును ధ్వంసం చేశారు. ఇది భారత సైన్యం ఆయుధ సంపత్తిని […]
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డీఆర్డీవో నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను డీఆర్డీవో పరీక్షించింది. ఆర్మీ సహకారంతో క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా డీఆర్డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణితో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని యుద్ధ ట్యాంకును ధ్వంసం చేశారు. ఇది భారత సైన్యం ఆయుధ సంపత్తిని మరింత ఇనుమడింపజేసింది.భారత సైన్యం ఆయుధ సంపత్తిని మరింత ఇనుమడింపజేసింది. లక్ష్యాలన్నింటిని చేరుకున్నట్లు డీఆర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావటంతో సైన్యం కోసం మూడో తరం క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేసి ఇవ్వడానికి మార్గం సుగమమైంది. డీఆర్డీవో బృందాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న డీఆర్డీవో పరిశ్రమలో ప్రయోగాన్ని చేపట్టారు.
14.5 కిలోల బరువుతో 2.5 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే మూడో తరం క్షిపణిని డీఆర్డీవో 2015 నుంచి అభివృద్ధి చేస్తూ వస్తోంది. యుద్ధ ట్యాంకుల్ని విధ్వంసం చేయగిలిగిన శక్తివంతమైన పేలుడు పదార్థంతో కూడిన వార్హెడ్ దీనికి ఉంటుంది. ప్రయోగాత్మక పరీక్షల కోసం డీఆర్డీవో 2018 చివరి నాటికి దీని ప్రొటోటైప్ను భారత సైనానికి అప్పగించింది. ఈ ఏడాది మార్చి 13, 14 తేదీల్లో రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో డీఆర్డీవో వరుసగా రెండు ప్రయోగాలు చేసింది. 2021 నుంచి వీటి ఉత్పత్తి పెద్ద ఎత్తున మొదలవుతుంది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్న ఈ క్షిపణుల సామర్థ్యంపై రక్షణశాఖ తొలుత అనుమానం వ్యక్తం చేసింది. విదేశాల్లో తయారైన వాటి కొనుగోలుకు మొగ్గుచూపింది. అయితే క్షిపణులన్ని విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించటంతో రక్షణశాఖ సంతోషం వ్యక్తం చేసింది. మూడు ప్రయోగాలు విజయవంతం కావటంతో సైన్యానికి కావాల్సిన తేలికపాటి క్షిపణులు త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది.
#WATCH Successful test firing of the Man Portable Anti Tank Guided Missile system by DRDO from a firing range in Kurnool, Andhra Pradesh, today. pic.twitter.com/h18JqHzFgp
— ANI (@ANI) September 11, 2019
#WATCH Successful test firing of the Man Portable Anti Tank Guided Missile system by DRDO from a firing range in Kurnool, Andhra Pradesh, today. pic.twitter.com/h8TLrbpv6n
— ANI (@ANI) September 11, 2019