రియా బెయిల్ పిటిషన్ పై విచారణ 29 కి వాయిదా
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టు విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది. గురువారం ఈ పిటిషన్ పై విచారణ జరిగినప్పటికీ, దీన్ని 29 కి న్యాయమూర్తులు వాయిదా వేశారు..
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టు విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది. గురువారం ఈ పిటిషన్ పై విచారణ జరిగినప్పటికీ, దీన్ని 29 కి న్యాయమూర్తులు వాయిదా వేశారు. అంతవరకూ ఆమె ముంబై లోని బైకుల్లా జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉండాల్సిందే. తన బెయిల్ దరఖాస్తును సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో రియా బాంబే హైకోర్టుకెక్కింది. డ్రగ్స్ కేసులో ఆమెను ఎన్సీబీ.. ఈనెల 8 న అరెస్టు చేసింది. కాగా రియా అక్టోబర్ 6 వరకు జ్యూడిషియల్ కస్టడీలో కొనసాగవలసి ఉంది.