హీరో సూర్య ఆఫీసుకు బాంబు బెదిరింపు..
తమిళ హీరోలతో పాటు రాజకీయ నాయకులనను బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాడు. ముఖ్యంగా కోలీవుడ్ ప్రముఖ నటులు సూపర్స్టార్ రజినీకాంత్....
తమిళ హీరోలతో పాటు రాజకీయ నాయకులను బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాడు. ముఖ్యంగా కోలీవుడ్ ప్రముఖ నటులు సూపర్స్టార్ రజినీకాంత్, అజిత్, మణిరత్నం, విజయ్ తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ కాల్స్ అని నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యను కేటుగాళ్లు టార్గెట్ చేశారు.
చెన్నై అల్వార్పేట ఏరియాలో ఉన్న సూర్య ఆఫీసులో బాంబు పెట్టినట్లు సోమవారం పోలీసులకు ఫోన్కాల్ వచ్చింది. దీంతో అలెర్టయిన పోలీసులు వెంటనే నిపుణులతో పాటు డాగ్స్వ్కాడ్ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఆ ఏరియాలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఇటువంటి ఫేక్ కాల్స్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అన్న అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ తరహా చర్యలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Also Read :