లంకెబిందెల కోసం మూగమహిళపై దారుణం

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎస్ఆర్ పురం మండలం వడ్డీ కండ్రిగ గ్రామంలో లంకె బిందెల కోసం ఓ మహిళను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు.

లంకెబిందెల కోసం మూగమహిళపై దారుణం
Follow us

|

Updated on: May 21, 2020 | 2:46 PM

Own relatives tried to kill a deaf woman in Chittur district: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎస్ఆర్ పురం మండలం వడ్డీ కండ్రిగ గ్రామంలో లంకె బిందెల కోసం ఓ మహిళను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సభ్యసమాజాన్ని నివ్వెర పరిచింది.

ఓ మాయల మాంత్రికుడు తమ పొలంలో లంకెబిందెలున్నాయని, వాటిని వెలికి తీయాలంటే మహిళను బలి ఇవ్వాలని చెప్పడంతో వడ్డీ కండ్రిగకు చెందిన ఓ మూగ మహిళను సొంత బంధువులే బలి ఇచ్చేందుకు సిద్దపడ్డారు. పొలంలోని లంకె బిందెలు వెలికి తీయాలంటే నరబలి ఇవ్వాలన్న ఒక మాంత్రికుడు మాటలు నమ్మి స్వయాన మేనత్త సరోజమ్మను నరబలి ఇచ్చేందుకు సొంత అల్లుడు శేషాద్రి, అతని తల్లి సుబ్బమ్మ ప్రయత్నించారు.

పొలంలో క్షుద్రపూజలు నిర్వహించి నరబలి ఇచ్చే ప్రయత్నంలో సదరు మూగ మహిళ సరోజమ్మ అక్కడ్నించి తెలివిగా తప్పించుకోవడంతో బతికిపోయింది. మిగతా గ్రామస్తులకు ఆమె ద్వారా విషయం తెలిసి పోలీసులకు సమాచారం వెళ్ళింది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు గురువారం క్షుద్రపూజలు నిర్వహించిన పొలాన్ని సందర్శించారు. అక్కడ క్షుద్రపూజలు జరిపినట్లు నిర్ధారించారు. శేషాద్రి, సుబ్బమ్మ లిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.