ఓవైసీ బ్రదర్స్.. అలా అనకపోతే.. మీకు పాకిస్థానే కరెక్ట్.. !
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఎంఐఎం పార్టీ అధినేతలైన ఓవైసీ బ్రదర్స్ను టార్గెట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు భారత్ సత్తా, స్వాతంత్య్ర సమరయోధుల శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే ఆరెస్సెస్లో చేరాలని సూచించారు. ఆదివారం దసరా ఉత్సవం సందర్భంగా గోషామహాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్.. దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్సెస్ అని […]
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఎంఐఎం పార్టీ అధినేతలైన ఓవైసీ బ్రదర్స్ను టార్గెట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు భారత్ సత్తా, స్వాతంత్య్ర సమరయోధుల శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే ఆరెస్సెస్లో చేరాలని సూచించారు. ఆదివారం దసరా ఉత్సవం సందర్భంగా గోషామహాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్.. దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్సెస్ అని అన్నారు. ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరు భారత్ మాతా కీ జై, వందే మాతరం అనాలని.. అలా అనని వారు ఈ దేశంలో ఉండే హక్కులేదన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలు ఈ నినాదాలు చేయకపోతే.. వారు పాకిస్థాన్ వెళ్లడమే ఉత్తమమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
गोशामहाल में #RSS के पतसंचलन कार्यक्रम में हिस्सा लिया लगभग 1000 कार्यकर्ताओ के साथ
मैं असदुद्दीन और अकबरुद्दीन ओवैसी से कहना चाहता हु के अगर आपको भारत के प्रति देश भक्ति देखनी है तो #RSS में जुड़िये आपको पता चल जाएगा कि भारत माता की जय, वन्दे मातरम का महत्व क्या होता है@RSSorg pic.twitter.com/UZslBUxcRq
— Raja Singh (@TigerRajaSingh) October 6, 2019