మహారాష్ట్ర…శివసేనతో చేతులు కలుపుతాం..బీజేపీ
మహారాష్ట్రలో శివసేనతో మళ్ళీ చేతులు కలపడానికి తాము సిధ్ధమేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత పాటిల్ ప్రకటించారు. తమ పార్టీ ఇందుకు రెడీగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో సొంతంగా..
మహారాష్ట్రలో శివసేనతో మళ్ళీ చేతులు కలపడానికి తాము సిధ్ధమేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత పాటిల్ ప్రకటించారు. తమ పార్టీ ఇందుకు రెడీగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి వచ్ఛేలా కృషి చేయాలనీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…. రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పాటిల్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కొల్హాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. శివసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎన్నికల్లో తమకు తాము ఒంటరిగా పోటీ చేస్తామని, అయితే కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటు మహారాష్ట్ర సీఎం ఉధ్దవ్ థాక్రే కూడా అవసరమైతే..బీజేపీతో మళ్ళీ జత కట్టడానికి విముఖంగా ఏమీ లేరు.