Big Breaking: జగన్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు.. ఆయనేం చేశారంటే?

ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అమిత్‌షాకు పిర్యాదు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతుందంటూ... కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్...

Big Breaking: జగన్‌పై అమిత్‌షాకు ఫిర్యాదు.. ఆయనేం చేశారంటే?
Follow us

|

Updated on: Mar 13, 2020 | 4:53 PM

BJP telugu MPs met Amith Shah: ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అమిత్‌షాకు పిర్యాదు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతుందంటూ… కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ అమిత్‌షాకు నివేదించారు. ఈ మేరకు సాక్ష్యాలతో కూడిన లేఖను వీరు ముగ్గురు శుక్రవారం అమిత్‌షాకు అంద జేశారు.

అనంతరం ముగ్గురు ఎంపీలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయనీయకుండా అడ్డుకుంటూ దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, నామినేషన్లు దాఖలు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వివరించారు.

అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, బెంగాల్, కేరళ తరహా పరిస్థితులను ఏపీలో బీజేపీ నేతలు ఎదుర్కొంటున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్ళామని జీవీఎల్ తెలిపారు. ఈ తరహా అప్రజాస్వామిక విధానాలను ఇకపై సహించేది లేదని, అందుకే కేంద్రం జోక్యాన్ని కోరామని ఆయన వివరించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో హైకోర్టు ఆదేశాలను సైతం ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగించకుండా అలాగే ఉంచారని జీవీఎల్ ఆరోపించారు.

స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని, బీజేపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని జీవీఎల్ అంటున్నారు. మరో ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పైన ఉందని అన్నారు. దేశంలో వైసీపీకి ఎక్కడ లేని విధంగా మెజారిటీ వచ్చిందని, దాంతో చక్కటి పాలన అందించాల్సిం పోయి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ.. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తూ జగన్ పరిపాలిస్తున్నారని రమేశ్ ఆరోపించారు. ఇంకో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్.. ఏపీలో రాచరికపు పాలన తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తగిన విధంగా స్పందిస్తానని అమిత్‌షా తమకు హామీ ఇచ్చారని బీజేపీ ఎంపీలు అంటున్నారు.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!