లండన్లో బీజేపీ నేత కుమారుడు మిస్సింగ్..!
లండన్లో తెలుగు విద్యార్థి మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కొడుకు ఉజ్వల్ శ్రీహర్ష శుక్రవారం మధ్యాహ్నం నుండి కనిపించటం లేదని లండన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఈ మేరకు లండన్ పోలీసులు ఖమ్మంలో ఉంటున్న హర్ష కుటుంబ సభ్యులకు సమాచారం అందిచ్చారు. దీంతో…హర్ష తల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ కొడుకు ఎక్కడున్నాడో అని హర్ష తండ్రి ప్రతాప్ బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మం […]
లండన్లో తెలుగు విద్యార్థి మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కొడుకు ఉజ్వల్ శ్రీహర్ష శుక్రవారం మధ్యాహ్నం నుండి కనిపించటం లేదని లండన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఈ మేరకు లండన్ పోలీసులు ఖమ్మంలో ఉంటున్న హర్ష కుటుంబ సభ్యులకు సమాచారం అందిచ్చారు. దీంతో…హర్ష తల్లి దండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ కొడుకు ఎక్కడున్నాడో అని హర్ష తండ్రి ప్రతాప్ బోరున విలపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్లో ఉదయ్ ప్రతాప్తో పాటు వారి బంధువులతో మాట్లాడారు. హర్షకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విదేశాంగ శాఖ వారితో పాటు.. లండన్లో ఉన్న తెలుగు వారితో మాట్లాడుతానన్నారు. హర్ష మిస్సింగ్పై ప్రత్యేకంగా కేంద్రానికి లెటర్ రాస్తానన్నారు నామా నాగేశ్వరరావు. ఇదిలా ఉంటే.. మరోవైపు హర్ష ఆచూకీ కోసం లండన్ పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. హర్ష నివాసం ఉండే.. ఇంటితో పాటు.. అతను చదివే కాలేజీకి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లాడనే దానిపై లండన్ పోలీసులు ఆరా తీస్తున్నారు.