కేంద్ర మాజీ మంత్రి కృష్టంరాజుకి అవమానం..!!
ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు అవమానం జరిగింది. దసరా మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు.. కృష్ణం రాజు ఫ్యామిలీ.. బెజవాడ వెళ్లారు. అక్కడ ఇతర భక్తులతో పాటు ఆయన కూడా క్యూలో.. మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సివచ్చింది. ఆయాస పడుతూనే ఆయన క్యూలైన్లో.. కుంకుమ పూజ జరిగే ప్రదేశానికి చేరాల్సి వచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని.. చెప్పినా.. దేవస్థాన సిబ్బంది పట్టించుకోనందుకు ఆయన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనాలని.. ఇందుకు […]
ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు అవమానం జరిగింది. దసరా మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు.. కృష్ణం రాజు ఫ్యామిలీ.. బెజవాడ వెళ్లారు. అక్కడ ఇతర భక్తులతో పాటు ఆయన కూడా క్యూలో.. మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సివచ్చింది. ఆయాస పడుతూనే ఆయన క్యూలైన్లో.. కుంకుమ పూజ జరిగే ప్రదేశానికి చేరాల్సి వచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని.. చెప్పినా.. దేవస్థాన సిబ్బంది పట్టించుకోనందుకు ఆయన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనాలని.. ఇందుకు సిబ్బందికి సమాచారాన్ని దుర్గగుడి సిబ్బందిని అడిగినప్పటికీ వారు ఏమీ స్పందించలేదు. దీంతో.. సాధారణ భక్తుల మాదిరిగా.. ఆయన తప్పనిసరిగా.. సిక్స్ ఫ్టోర్స్ మెట్లు దిగాల్సివచ్చింది. ప్రముఖ వీఐపీ అయిన కృష్ణంరాజు పట్ల.. ఇలా ఆలయ అధికారులు ప్రవర్తించడం పట్ల.. ఆయన కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు కూడా ఆయన్ని పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. చివరకు కృష్ణంరాజు కుటుంబం కుంకుమ పూజలో పాల్గొని.. అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోయారు.