Breaking : మరో విషాదం… బస్సు, ట్రక్కు ఢీ- 9 మంది కూలీలు మృతి..!
కరోనా కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటొన్న వలస కార్మికులను విధి కూడా పగబట్టినట్టు ఉంది. ఈ మధ్య జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇంటికి వెళ్లేందుకు ఎక్కిన ట్రక్కులు, లారీలే వారికి యమ పాశాలవుతున్నాయి. తాజాగా బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాగల్పుర్ జిల్లా నౌగాచియా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనలో 9 మంది కూలీలు ప్రాణాలు విడిచారు. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కి […]
కరోనా కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటొన్న వలస కార్మికులను విధి కూడా పగబట్టినట్టు ఉంది. ఈ మధ్య జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇంటికి వెళ్లేందుకు ఎక్కిన ట్రక్కులు, లారీలే వారికి యమ పాశాలవుతున్నాయి.
తాజాగా బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాగల్పుర్ జిల్లా నౌగాచియా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనలో 9 మంది కూలీలు ప్రాణాలు విడిచారు. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.