కరోనాతో మరో మంత్రి మృతి

కరోనా మహమ్మారి మరో మంత్రిని బలితీసుకుంది. తాజాగా జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బీహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్  కరోనాతో కన్నుమూశారు.

కరోనాతో మరో మంత్రి మృతి
Follow us

|

Updated on: Oct 16, 2020 | 4:43 PM

Bihar Minister Died : కరోనా మహమ్మారి మరో మంత్రిని బలితీసుకుంది. తాజాగా జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బీహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్  కరోనాతో కన్నుమూశారు. 69 ఏళ్ల వయసున్న మంత్రి కపిల్ దియోకు ఇటీవల కరోనా సోకడంతో ఆయన పట్నాలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్‌లో చేరి గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు.

ఆయనకు కరోనాతోపాటు కిడ్నీసంబంధిత సమస్యుల  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మంత్రి కామత్ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.

అయితే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ మ‌ృతి పట్ల జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాధరణ కలిగిన మంచి నాయకుడిని కోల్పోయామంటూ బీహార్ సీఎం ట్విట్ చేశారు.

ఆయన మరణం రాజకీయ, సామాజిక రంగాల్లో కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. కామత్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.