నందిగామ కెడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం
నందిగామ కెడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2018లో బ్యాంక్ అధికారిగా పని చేసిన వ్యకి రుణం పేరుతో 19.50 లక్షలు స్వాహా చేశాడు.
నందిగామ కెడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2018లో బ్యాంక్ అధికారిగా పని చేసిన వ్యకి రుణం పేరుతో 19.50 లక్షలు స్వాహా చేశాడు. సదరు అధికారి బదిలీపై వెళ్లడంతో అవకతవకలు బయటపడ్డాయి. దీనిపై వెంటనే స్పందించిన బ్యాంక్ సీఈఓ విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సదరు అధికారి వెంటనే బ్యాంక్కు వచ్చి స్వాహా చేసిన సొమ్మును జమ చేసినట్లు తెలుస్తోంది.
కాగా కేడీసీసీ బ్యాంకులతో పాటు సొసైటీల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సొసైటీల్లో రైతులకు లోన్లు పేరుతో భారీగా డబ్బు దండుకుంటున్నారని, అన్నదాతలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోని దోపిడి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా కొద్దో, గొప్పో చదువుకున్న రైతులు అవకతవకల గురించి ప్రశ్నిస్తే వారికి లోన్లు రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సొసైటీ, కేడీసీసీ బ్యాంకు వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవకాశం కనిపిస్తోంది.
Also Read :
ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన సర్కార్