బ్రేకింగ్: వాన్పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డకు ఊరట..!
వాన్పిక్ కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్కు.. ఈడీ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించింది. గతంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో.. జగన్కు చెందిన 538 కోట్ల రూపాయల మేర ఊరట దక్కింది. ఇడుపుల పాయలో 42 ఏకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఫ్లాట్లు, కమర్షియల్ స్థలాలు, షేర్లు, ఓ టీవీ ఛానెల్కు సంబంధించిన యంత్రాల జప్తు జరిగింది. ఇప్పుడు వీటిని విడుదల చేయాలని ట్రిబ్యునల్ […]
వాన్పిక్ కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్కు.. ఈడీ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించింది. గతంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో.. జగన్కు చెందిన 538 కోట్ల రూపాయల మేర ఊరట దక్కింది. ఇడుపుల పాయలో 42 ఏకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఫ్లాట్లు, కమర్షియల్ స్థలాలు, షేర్లు, ఓ టీవీ ఛానెల్కు సంబంధించిన యంత్రాల జప్తు జరిగింది. ఇప్పుడు వీటిని విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటు నిమ్మగడ్డకు చెందిన 325 కోట్ల విలువైన ఆస్తులు కూడా గతంలో జప్తు అయ్యాయి. దాన్ని కూడా రద్దు చేసిన ట్రిబ్యునల్ 274 కోట్ల రూపాయలకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని ప్రసాద్ను ఆదేశించింది.