హద్దుల్లేని ప్రేమ, ప్రియుడి కోసం పాస్పోర్టు లేకుండా ఇండియాలోకి, అరెస్ట్ !
బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు..ఇండియాలోని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నివాసముంటున్న ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త స్నేహం అయ్యింది.
బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు..ఇండియాలోని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నివాసముంటున్న ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త స్నేహం అయ్యింది. కొద్ది కాలంలోనే అది ప్రేమగా మారింది. కట్ చేస్తే ప్రియుడిని పెళ్లి చేసుకోడానికి పాస్పోర్టు లేకుండా భారత్లోకి ప్రవేశించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నివాసముంటున్న శశిషేక్ (28)కు ఫేస్బుక్ (ముఖచిత్రం) ద్వారా బంగ్లాదేశ్కు చెందిన పాపియో ఖోష్(22) అనే మహిళతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో పాపియో ఖోష్ పాస్పోర్టు లేకుండా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఇద్దరూ తమిళనాడు చేరుకుని ఈ నెల 12న కోవై జిల్లా పొల్లాచ్చిలో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. ఆపై చెన్నై మీంజూర్లో కాపురం పెట్టారు.
తన కుమార్తె కనిపంచడం లేదని బంగ్లాదేశ్ పోలీసులకు యువతి ఫాదర్ కంప్లైంట్ చేశాడు. బంగ్లాదేశ్, భారత పోలీసులు సంయుక్తంగా జరిపిన విచారణలో యువతి మీంజూరులో ఉన్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో కాంచీపురం పోలీసులు పాపియో ఖోష్ను అదుపులోకి తీసుకుని.. మీంజూరు పోలీసులకు అప్పగించారు. పాస్పోర్టు లేకుండా దేశంలోకి చొరబడినట్లు నిర్ధారణ అవ్వడంతో యువతిని పొన్నేరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Also Read : బిగ్ బాస్ 4 : మోనాల్ మ్యాజిక్, సీజన్ చివర్లో షాకింగ్ ఓటింగ్, ఆటపై ఫోకస్ పెట్టిన గుజరాత్ బ్యూటీ