రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ అనుచరుడు..

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆయన మాజీ అనుచరుడు బాల్‌సింగ్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ నాయకుడు కాదని.. ఆయనొక బ్లాక్ మెయిలర్ అన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ భూదందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలేనని.. ఏ ఒక్క కేసుపై కూడా చివరి వరకు రేవంత్ రెడ్డి పోరాడడన్నారు. మధ్యలోనే డబ్బులకు సెటిల్మెంట్ చేసుకుంటారంటూ బాల్‌సింగ్ నాయక్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉండగా.. ఎఫ్‌టీఎల్ పరిధిలో రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడంటూ ఆరోపించారు. కాగా, మంత్రి కేటీఆర్ లీజుకు […]

రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ అనుచరుడు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 14, 2020 | 7:09 PM

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆయన మాజీ అనుచరుడు బాల్‌సింగ్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ నాయకుడు కాదని.. ఆయనొక బ్లాక్ మెయిలర్ అన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ భూదందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలేనని.. ఏ ఒక్క కేసుపై కూడా చివరి వరకు రేవంత్ రెడ్డి పోరాడడన్నారు. మధ్యలోనే డబ్బులకు సెటిల్మెంట్ చేసుకుంటారంటూ బాల్‌సింగ్ నాయక్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉండగా.. ఎఫ్‌టీఎల్ పరిధిలో రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడంటూ ఆరోపించారు.

కాగా, మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న స్థలంలో డ్రోన్ కెమెరాలు ఎగరేసి చిత్రీకరించిన కేసులో.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి  జైల్లో ఉన్న విషయం తెలిసిందే.